Om Bheem Bush: రండి.. ఛిల్ అవుదాం.. ‘ఓం భీమ్ బుష్’ ట్రైలర్!
శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఓం భీమ్ బుష్’. ఇందులో రీతూవర్మ హీరోయిన్గా నటిస్తుండగా.. ‘హుషార్’ ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ అభిమానులను ఆకట్టుకున్నాయి. తాజాగా, మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు. వి.సెల్యులాయిడ్తో కలిసి సునీల్ బలుసు నిర్మిస్తుండగా.. యూవీ క్రియేషన్స్ సంస్థ సమర్పిస్తోంది.
ALSO READ: వరుస సినిమాలతో అనుపమ బిజీ… మరో ప్రాజెక్టుకు సైన్
ఒకరోజు ముందే ట్రైలర్..
హైదరాబాద్ అభిమానుల కోసం ఈరోజు సాయంత్రం 7 గంటలకు జూబ్లీహిల్స్లో ట్రైలర్ ఒకరోజు ముందే వీక్షించేందుకు అవకాశం కల్పించారు. ‘రండి ప్రజల్లారా.. మా ట్రైలర్ అందరి కంటే ముందే చూపిస్తాం.. ఛిల్ అవుదాం’ అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ఈ మూవీ ట్రైలర్ మార్చి 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఎక్స్ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా మార్చి 22న విడుదల కానుంది.