తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Operation Valentine: వరుణ్ తేజ్ కొత్త మూవీ సాలిడ్ అప్‌డేట్.. ఆసక్తి రేకెత్తించేలా టీజర్‌

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ న‌టిస్తున్న తాజా చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’. ఈ సినిమాకు శక్తిప్రతాప్‌ సింగ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. మానుషీ చిల్లర్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్‌, రినైసన్స్‌ పిక్చర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తుండ‌గా.. భారతదేశం ఎదుర్కొన్న అతిపెద్ద వైమానిక దాడుల నేపథ్యంలో యథార్థ సంఘటనల స్ఫూర్తితో ఈ సినిమా రానుంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి మేక‌ర్స్ సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు.

ALSO READ: ముంబైలో ప్రభాస్ భారీ కటౌట్.. ఎన్ని అడుగులంటే?

వరుణ్ డైలాగ్ టీజ‌ర్‌కే హైలెట్‌

ఈ మూవీ నుంచి ఫ‌స్ట్ స్ట్రైక్ పేరిట మేకర్స్ టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో వరుణ్.. ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌గా కనిపించాడు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ‘మన ఎయిర్ ఫోర్స్‌ను ఇంకొక దేశం పంపించడమంటే.. అది యుద్దానికి సంకేతమే’ అని ఒక ఆఫీసర్ చెప్పిన డైలాగ్‌తో టీజర్ ప్రారంభమవుతోంది. ఇక వరుణ్‌ తేజ్ చెప్పే.. ‘శత్రువులకు ఒక విషయం గుర్తు చేయాల్సిన సమయం వచ్చింది. మన దేశం గాంధీజీతో పాటు సుభాష్ చంద్రబోస్‌ది కూడా’ అనే డైలాగ్ టీజ‌ర్‌కే హైలెట్‌గా నిలిచింది. ఈ సినిమాను 2024 ఫిబ్ర‌వ‌రి 16న తెలుగు, హిందీ భాష‌ల్లో విడుద‌ల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button