Poacher: ఆసక్తికరంగా ‘పోచర్’ ట్రైలర్.. కొత్త క్రైమ్ సిరీస్
ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్షన్ సంస్థ క్యూసీ ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూజ్ చేస్తున్న తాజా క్రైమ్ వెబ్ సిరీస్ ‘పోచర్’. ఈ సిరీస్కు ఎమ్మీ అవార్డు విన్నర్ రిచీ మెహతా దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోతో కలిసి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ నిర్మాతగా వ్యవహరిస్తోంది’. ఇందులో నిమిషా సజయన్, రోషన్ మథ్యూ, దివ్యేంద్ర భట్టాచార్య తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా, మేకర్స్ సిరీస్ నుంచి ట్రైలర్ విడుదల చేశారు.
ALSO READ: ఓటిటిలోకి వచ్చేస్తున్న కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
8 ఎపిసోడ్లుగా సిరీస్..
అడవుల్లో వణ్య ప్రాణులు ముఖ్యంగా ఏనుగులపై జరిగిన దాడులు, కుట్రలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో దాడి చేసిన వారిని పట్టుకునేందుకు అధికారులు ఏం చేశారనేది ఈ సిరీస్ కథ. 8 ఎపిసోడ్లుగా రానున్న ఈ సిరీస్.. ఫిబ్రవరి 23వ నుంచి స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది.