టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ, వంశీ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు. రియల్ రాబిన్ హుడ్గా పేరుపొందిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు.
ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ కృతి సనన్, చెల్లెలు నుపూర్ సనన్ హీరోయిన్గా నటిస్తుండగా,రేణు దేశాయ్ కీలక పాత్రలో నటిస్తుంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్నఈ సినిమాలో, ఇప్పటివరకు కనివిని ఎరుగని మాస్ లుక్లో రవితేజను చూపించనున్నారు డైరెక్టర్ వంశీ.
ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, టైగర్ నాగేశ్వర రావు ఈ ఏడాది దసరాకి విడుదల కానుందని మేకర్స్ గతంలోనే ప్రకటించారు. అయితే కొద్ది రోజులుగా ఈ మూవీ రిలీజ్ డేట్పై రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. వి ఎఫ్ ఎక్స్ వర్క్ పూర్తి కాలేదని, చెన్నై నుంచి ఓ టీమ్, అలాగే ముంబై నుంచి ఓ టీమ్ ఈ సినిమా గ్రాఫిక్స్ పనుల్లో ఉన్నారట.
గ్రాఫిక్స్ వర్క్ అనుకున్న టైమ్కి కంప్లీట్ అయ్యేలా లేదని, దీంతో టైగర్ నాగేశ్వరరావు మూవీ దసరాకి రావడం కష్టమే అని, సోషల్ మీడియాలో రూమర్స్ స్పెడ్ అయ్యాయి. మరోవైపు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని, ప్రకటించిన తేది అక్టోబర్ 20న ఈ సినిమా థియేటర్స్కి వస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. మరి దసరాకి థియేటర్స్లో రాబిన్ హుడ్ హంట్ ఉంటుందా లేదా అనేది చూడాలి.