Vaddepalli Srinivas: టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ సింగర్ కన్నుమూత
టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ, జానపద నేపథ్య గాయకులు వడ్డేపల్లి శ్రీనివాస్ కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నేడు ఉదయం సికింద్రాబాద్ పద్మారావు నగరంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. దీంతో సినీ ప్రముఖులు, జానపద కళాకారులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.
Also read: Deepika Padukone: తల్లికాబోతున్న బాలీవుడ్ హీరోయిన్.. విష్ చేస్తున్న ఫ్యాన్స్
దాదాపు 100కి పైగా పాటలు, జానపద గేయాలు పాడారు. గజ్జకట్టి పలు స్టేజీల మీద తనదైన ఆటపాటలతో అలరించారు. 2012లో గబ్బర్ సింగ్ సినిమాలో ‘గన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్ల..’ అనే సాంగ్ తో ఎంతో ఫేమస్ అయ్యారు. ఈ పాటకి ఫిలింఫేర్ బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ మేల్ అవార్డు కూడా అందుకున్నారు. కింగ్ మూవీలో ఎంత పని చేస్తివిరో.. సాంగ్ పాడి యూత్ ని ఆకట్టుకున్నారు. అలాగే కిక్, బెంగాల్ టైగర్, నమస్తే అన్న లాంటి సినిమాల్లో కూడా పాడారు.