తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

CM Jagan: అన్నదాతలకు తీపికబురు.. పంటల ఇన్ పుట్ సబ్సిడీ విడుదల

ఏపీ ప్రభుత్వం రైతులకు ఇన్ పుట్ సబ్సిడీని విడుదల చేసింది. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో సీఎం జగన్ బటన్ నొక్కి రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేశారు. ఈ క్రమంలో రైతులకు సమయానికి సహాయం చేస్తున్నామని, ఏ పంట నష్టం జరిగినా పారదర్శకంగా పరిహారం ఇస్తున్నామని అన్నారు. తమ ప్రభుత్వం అన్నిరకాలుగా రైతులకు అండగా ఉందని, రైతులు నష్టపోకూడదన్నది ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. గతంలో రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనే పరిస్థితి ఉండేది కాదని, తమ ప్రభుత్వం వచ్చాక రంగుమారిన ధాన్యాన్ని కూడా కొన్నామని అన్నారు.

Also read: Elections: లోక్ సభ ఎన్నికలు… నోటిఫికేషన్ వచ్చేది అప్పుడే!

మిచాంగ్ తుపాను సమయంలో 3.25 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని అన్నారు. ఏపీలో 87 శాతం మంది రైతులకు హెక్టారు లోపే భూమి ఉందని అన్నారు. సుమారు 12 లక్షల మంది మిచాంగ్ తుపాను బాధిత రైతులకు సాయం చేశామని అన్నారు. 1294 కోట్ల రూపాయలు నేరుగా రైతుల అకౌంట్లలో వేశామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button