తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: చంద్రబాబు పైరవీలు ఫెయిల్.. బీజేపీతో పొత్తు లేనట్లేనా?

టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీతో పొత్తు కోసం గత కొంతకాలంగా పాకులాడుతున్నారు. 2014 నుంచి 2019 వరకు బీజేపీ పార్టీతో పొత్తులో ఉన్న టీడీపీ, 2019 ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తును రద్దు చేసుకుని ఆ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే మళ్లీ జనసేనతో జతకట్టిన చంద్రబాబు.. ఓటమి భయం వెంటాడటంతో బీజేపీతో పొత్తు కోసం పడిగాపులు కాస్తున్నారు. ఇందులో భాగంగానే ఢిల్లీ వెళ్లిన ఆయన బీజేపీ నేతలతో భేటీ అయి పొత్తులపై చర్చించారు.

ALSO READ:  పవన్ నిలబెట్టిన 24 మంది అభ్యర్థులను కూడా చంద్రబాబే ఓడిస్తాడు!

చంద్రబాబుకు షాక్‌!

రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ తరఫున పోటీ­చేసే ప్రతిపాదిత అభ్యర్థుల జాబితాలను సిద్ధంచేశామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వెల్లడించారు. అయితే పొత్తుల గురించి ఎలాంటి చర్చ జరగలేదంటూ ఆమె పేర్కొన్నారు. 26 జిల్లాలు.. 175 అసెంబ్లీ స్థానాల్లో రాజకీయ, సామాజిక పరిస్థితులపై ఆరా తీశామని, అభ్యర్థుల ఎంపిక.. సామాజిక సమీకరణ సహా అన్ని అంశాలపై చర్చించమని, పొత్తులు సహా ఎలాంటి నిర్ణయమైనా పార్టీ హైకమాండ్‌దే అని పురందేశ్వరి స్పష్టం చేశారు. తాజాగా, ఆమె చేసిన వ్యాఖ్యలతో టీడీపీతో పొత్తు ఉండకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

ALSO READ: ముద్రగడ వైసీపీలోకి ఎంట్రీ.. వ్యూహం అదేనా?

అంగీకరించడం లేదా?

బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు పైరవీలు చేస్తున్నా.. ఆ పార్టీ పెద్దలు అంగీకరించడంలేదని తెలుస్తోంది. అంతకుముందు చాలామంది నాయకులు బీజేపీలో చేరినప్పటికీ చంద్రబాబు ప్రయోజనాల కోసమే పనిచేసినట్లు వార్తలు వినిపించాయి. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి సైతం టీడీపీతో పొత్తు కోసం ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దీంతో చంద్రబాబు బీజేపీతో పొత్తు కోసం ప్రతిపాదన వచ్చేలా పైరవీలు కొనసాగించాట. అయితే చంద్రబాబు మార్కు రాజకీయాలు తెలిసిన బీజేపీ అధిష్టానం పొత్తులపై ఆచితూచి అడుగులు వేస్తోందని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button