తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Government: చదువుల్లో క్వాలిటీ.. భవిత పేరుతో కొత్త కార్యక్రమం

చదువులన్నీ జాబ్‌ ఓరియెంటెడ్‌గా ఉండాలనే ఉద్ధేశంతో చదువుల్లో క్వాలిటీ పెంచుతున్నామని సీఎం జగన్ అన్నారు. విశాఖ పర్యటనలో భాగంగా పీఎం పాలెం వైజాగ్ కన్వెన్షన్ సెంటర్‌‌లో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ మేరకు యువత నైపుణ్యాభివృద్ధికి సంబంధించి భవిత కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించారు. క్వాలిటీ చదవుల కోసం కరిక్యులమ్‌లో మార్పులు తీసుకొచ్చామన్నారు.

ALSO READ: దేశాన్ని ఆకర్షించే ఐకానిక్..ఏపీ రాజధానిగా విశాఖ!

కాలేజీల వరకు ఇవే అడుగులు..

పాఠశాలల నుంచి కాలేజీల వరకు ఇవే అడుగులు వేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. అధికారంలోకి వచ్చిన ఈ నాలుగున్నర ఏళ్లల్లో విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. ఇందులో భాగంగా పాఠశాలలో 3వ తరగతి నుంచి సబ్జెక్ట్‌ టీచర్‌ కాన్సెప్ట్‌ తీసుకురావడంతోపాటు టోఫెల్‌ శిక్షణ ఇస్తున్నామని వెల్లడించారు. క్వాలిటీ ఎడ్యుకేషన్‌తో మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. 158 పారిశ్రామిక సంస్థలు వచ్చి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాయన్నారు.

ALSO READ: విశాఖకు కొత్త ఇమేజ్.. అన్ని రంగాల్లో అభివృద్ధే లక్ష్యం

విద్యార్థులకు ట్రైనింగ్‌..

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ జిల్లాలో స్కిల్‌ కాలేజ్‌, ప్రతీ నియోజకవర్గంలో ఒక స్కిల్‌ హబ్‌ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులకు ట్రైనింగ్‌ ఇచ్చి చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం వచ్చేలా మార్పులు తీసుకొస్తామన్నారు. అనంతరం పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చేపట్టిన 70 లక్షల వ్యయంతో స్కిల్ డెవలప్‌మెంట్‌ సెంటర్ నిర్మాణాన్ని విశాఖపట్నం నుంచి సీఎం జగన్ వర్చువల్‌గా ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button