తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: దేశాన్ని ఆకర్షించే ఐకానిక్..ఏపీ రాజధానిగా విశాఖ!

ఎన్నికల తర్వాత ఏపీ రాజధానిగా విశాఖ ఉంటుందని సీఎం జగన్‌ సంచలన ప్రకటన చేశారు. విశాఖలో జరిగిన ఆంధ్ర ప్రదేశ్ డెవలప్‌మెంట్ డైలాగ్ సదస్సులో సీఎం జగన్ మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో గెలిచిన అనంతరం వైజాగ్‌లోనే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు. బెంగళూరు కంటే వైజాగ్‌లో సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయని, విశాఖ అభివృద్ధికి అన్ని విధాలుగా కట్టుబడి ఉంటామన్నారు.

ALSO READ: విశాఖకు కొత్త ఇమేజ్.. అన్ని రంగాల్లో అభివృద్ధే లక్ష్యం

అమరావతికి మేం వ్యతిరేకం కాదు

అమరావతి రాజధానికి మేం వ్యతిరేకం కాదని, అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతోందన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం లక్ష కోట్లు ఖర్చు పెట్టాలని, వైజాగ్‌లో ఇప్పటికే అవసరమైన అన్ని హంగులు ఉన్నాయన్నారు. విశాఖను ఎకనామిక్‌ గ్రోత్‌ ఇంజిన్‌లా మారుస్తామని చెప్పారు. విశాఖ స్టేడియాన్ని మెరుగ్గా నిర్మిస్తున్నామని, భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు విశాఖకు కనెక్టివిటినీ మెరుగు చేశామని, దేశాన్ని ఆకర్షించే ఐకానిక్ సెక్రటేరియట్‌ నిర్మిస్తామని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

ALSO READ: 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఇదే! కనిపించడం లేదా?

హైదరాబాద్‌ను కోల్పోయాం..

రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌ను కోల్పోయమని, అయినప్పటికి హైదరాబాద్‌ కంటే మిన్నగా వైజాగ్‌ అభివృద్ధి చెందుతుందని జగన్ వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, దేశంలో వ్యవసాయ రంగంలో ఏపీలో 70 శాతం వృద్ధి చెందిందన్నారు. దీంతో ఉత్పత్తి రంగంలో దేశంలోనే ఏపీ మెరుగ్గా ఉందని చెప్పారు. దీంతో పాటు రామాయపట్నం, కాకినాడ, మూలపేట, మచిలీపట్నం పోర్టులు కీలకంగా మారనున్నాయని, ఇప్పటికే ఏపీలో తలసరి ఆదాయం పెరిగిందన్నారు.

23 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button