తెలుగు
te తెలుగు en English
క్రికెట్

IPL 2024: ధోని సంచలన నిర్ణయం… ఐపీఎల్‌కి గుడ్ బై!

ఐపీఎల్‌-2024 సీజన్‌కు ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎంస్‌ ధోని ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే తన నిర్ణయాన్ని సీఎస్‌కేకు వెల్లడించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ధోని సోషల్‌ మీడియాలో చేసిన పోస్టు ఈ వార్తలకు మరింత ఊతమిస్తోంది. కొత్త సీజన్‌‌‌‌లో కొత్త పాత్ర కోసం వేచి ఉండలేను. చూస్తూ ఉండండంటూ పోస్ట్‌ చేశాడు.

Also Read: సన్‌రైజర్స్ హైద‌రాబాద్‌కు కొత్తసారథి.. ఎవరంటే?

దీంతో ధోని ఏ రోల్‌లో కనిపించనున్నాడా అని అభిమానులు తెగ ఆలోచించేస్తున్నారు. ఈ సీజన్‌లో మెంటార్‌గా ఎంఎస్‌ కొత్త బాధ్యతలు చేపట్టనున్నాడని అభిమానులు చర్చించుకుంటున్నారు. కాగా 42 ఏళ్ల ధోనీ గత సీజన్‌‌‌‌ లో సీఎస్‌కేను ఛాంపియన్‌గా నిలిపిన తర్వాత మళ్లీ మైదానంలో అడుగుపెట్టలేదు. ఒకవేళ ధోని తప్పుకుంటే సీఎస్‌కే కెప్టెన్‌గా యువ ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ బాధ్యతలు చేపట్టే ఛాన్స్‌ ఉంది. కాగా మార్చి 22 నుంచి ఐపీఎల్‌-2024 సీజన్‌ ప్రారంభం కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button