BJP: బీజేపీ జాతీయ నాయకత్వంపై ఏపీ బీజేపీ నేతల అసంతృప్తి!
కేంద్రంలోని బీజేపీ అధిష్టానం నిన్న 111 మంది ఎంపీ అభ్యర్థులతో కూడిన ఐదో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఆరుగురు ఎంపీ అభ్యర్థులకు చోటు దక్కింది. అనకాపల్లి నుంచి సీఎం రమేష్, అరకు- కొత్తపల్లి గీత, రాజమండ్రి- పురందేశ్వరి, నరసాపురం- శ్రీనివాస వర్మ, రాజంపేట- కిరణ్ కుమార్ రెడ్డి, తిరుపతి నుంచి వరప్రసాద్ పోటీ చేస్తారని ప్రకటించింది.
ALSO READ: వైసీపీ ఎన్నికల ప్రచార భేరి.. రాష్ట్రంలో 27నుంచి నయా జోష్
అయితే ఈ ఐదో జాబితాపై ఏపీ బీజేపీలో ముసలం నెలకొందనే చెప్పాలి. ఏళ్ల తరబడి పార్టీ కోసం శ్రమించిన, శ్రమిస్తున్న వారికి భంగపాటు తప్పలేదు. పార్టీ బలోపేతానికి అహరహం శ్రమిస్తున్న అసలు సిసలైన బీజేపీ నేతలకు షాక్ తగిలింది. ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతల వైపే బీజేపీ జాతీయ నాయకత్వం మొగ్గు చూపింది. ఎంపీ టిక్కెట్లు ఆశించిన జీవీఎల్, సత్యకుమార్, సోము వీర్రాజు, మాధవ్, విష్ణువర్దన్ రెడ్డి తదితరులకు చోటు దక్కకపోవడంతో తీవ్ర నిరాశలో మునిగిపోయినట్లు తెలుస్తోంది.