తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

CM Jagan: గెలుపే లక్ష్యంగా వైసీపీ ‘సిద్ధం’.. ఫైనల్ లిస్ట్ రెడీ!

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అధికార పార్టీ వైసీపీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లను మార్చిన ఫ్యాన్ పార్టీ.. సిద్ధం సభలతో దూసుకెళ్తోంది. కాగా, ఇప్పటివరకు 12 జాబితాలను విడుదల చేసిన వైసీపీ అధిష్టానం తాజాగా, అభ్యర్థుల తుది ప్రకటనకు రంగం సిద్ధం చేసింది. ఈ తరుణంలో మార్చి 16న చివరి జాబితా విడుదల చేసే అవకాశం ఉంది.

ALSO READ: చంద్రబాబు పంజా.. అప్పుడు బీజేపీ.. ఇప్పుడు జనసేన!

ఇడుపులపాయలో ఆఖరి జాబితా

అభ్యర్థుల విషయంలో తీవ్ర కసరత్తు చేసిన వైసీపీ నాయకత్వం.. చివరి జాబితా దాదాపు ఖరారైంది. ఈ నేపథ్యంలో అంతకు ముందు ప్రకటించిన అభ్యర్థులను కూడా మార్చుతోంది. ఈ మేరకు ఒకటి రెండు మార్పులతో సమన్వయకర్తల చివరి జాబితాను సైతం సిద్ధం చేసింది. ఇప్పటివరకు 77 అసెంబ్లీ స్థానాలకు, 23 పార్లమెంట్‌ స్థానాలకు ఇన్‌చార్జిలను నియమించింది. కాగా, ఈ నెల 16వ తేదీన వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచే వైసీపీ అభ్యర్థుల ఆఖరి జాబితాను విడుదల చేయనున్నట్లు వైసీపీ శ్రేణులు చెబుతున్నారు.

ALSO READ: పేదలకు ఇచ్చిన పట్టాలకు శాశ్వత హక్కులు

ఒంటరిగానే వస్తున్నా..

2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే సిద్ధం పేరుతో ప్రచారాన్ని మొదలుపెట్టిన వైఎస్ జగన్ ..ఈనెల 16వ తేది నుంచి రెగ్యులర్ ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. అయితే శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 16వ తేదీన చివరి జాబితాను విడుదల చేసిన అనంతరం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని సమాచారం. ఇచ్ఛాపురం నుంచి మొదలుపెట్టి అదేరోజు విజయవాడ వెస్ట్‌, నెల్లూరు రూరల్‌లో ఆయన ప్రచారంలో పాల్గొనచ్చని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన,బీజేపీ కూటమిని ఓడించడానికి ఒంటరిగానే వస్తున్నానని చెబుతున్న జగన్ ..ప్రజలే నాకు బలం, బలగం అంటూ ప్రచారంలో దూసుకుపోనున్నారు. కాగా, ఇప్పటికే పార్టీ ముఖ్యనేతలు రూట్ మ్యాప్‌పై చర్చించినట్లు తెలుస్తోంది.

48 Comments

  1. Ma jaganna janamu kosamu untadu janamu gudulo unadu janamu samadanmu chppataru tapakuda 2024 CM chystaru enthamandhi vachina apaleru

  2. Super jaganna నీతో ఎప్పుడు తోడుగా ఉంటాం
    2024 సీఎం మీరే

  3. ఒకడేమో మంచి మద్యమం ఇస్తాను అంటున్నాడు. ఇంకొకడు 50/-మద్యమం ఇస్తాను అన్నాడు. వేరొకడేమో పాత బ్రాండ్లు తెస్తాను అన్నాడు. ఒక్క జగన్ మాత్రమే మంచి విద్య వైద్యం ఇస్తాను అన్నాడు అందుకే జై జగన్

  4. Anna meeru simham single ga vasthharu, పందులే గుంపులుగా వస్తాయి.T.d.p,janasena,bjp
    Jai jagan.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button