తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Memantha Siddham Bus Yatra: జనజాతరను తలపిస్తున్న ‘బస్సు యాత్ర’..14వ రోజు షెడ్యూల్ ఇదే!

వైసీపీ అధినేత, వైఎస్‌ జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర జనజాతరను తలపిస్తోంది. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కొనసాగుతున్న జగన్ పాలనకు అశేష జనవాహిని బ్రహ్మరథం పడుతోంది. ఎండా, వర్షాన్ని లెక్కచేయకుండా కొనసాగుతున్న ఈ బస్సుయాత్ర 14వ రోజుకు చేరింది. ఈ మేరకు ఇవాళ ఎన్టీఆర్‌ జిల్లాలో కొనసాగనుంది. ఈ యాత్రలో భాగంగా వివిధ వర్గాల ప్రజలు సీఎంను కలిసి, తమ సమస్యలు విన్నవించుకుంటున్నారు.

ALSO READ: వైసీపీలోకి క్యూ కట్టిన టీడీపీ కూటమి నేతలు..!

చేనేత కార్మికులతో ముఖాముఖి..

నంబూరు బైపాస్‌ నుంచి ఇవాళ బస్సుయాత్ర ప్రారంభమైంది. కాజా, మంగళగిరి బైపాస్ మీదగా 11గంటలకు సీకే కన్వెన్షన్ వద్దకు చేరుకోనుంది. అక్కడ చేనేత కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. అనంతరం కుంచనపల్లి బైపాస్ మీదుగా తాడేపల్లి బైపాస్‌కు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. ఆ తర్వాత వారధి, శిఖామణి సెంటర్, చుట్టుగుంట, భగత్ సింగ్ రోడ్ , పైపుల రోడ్, కండ్రిక, రామవరప్పాడు, నిడమానూరు బైపాస్ మీదుగా కేసరపల్లి బైపాస్ శివారులో రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.

ALSO READ: బస్సు యాత్రకు విశేష స్పందన..13వ రోజు షెడ్యూల్ ఇదే!

యాత్రలో కోలాహలం

మేమంతా సిద్ధం యాత్ర మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడకు రానుంది. విజయవాడ ఈస్ట్, సెంట్రల్ నియోజకవర్గాల మీదుగా యాత్ర ఉండనుంది. ఈ బస్సుయాత్రను చూసేందుకు పెద్దసంఖ్యలో అభిమానులు పోటీ పడుతున్నారు. ఓవైపు వైసీపీ కార్యకర్తలు, మరోవైపు అభిమానులతో యాత్రలో కోలాహలం కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవ ర్యాలీలా మేమంతా సిద్ధం యాత్ర సాగుతోంది. కాగా, యాత్రలో భాగంగా మళ్లీ వైసీపీ సర్కార్ అధికారంలోకి వస్తుందని, మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని సీఎం జగన్ ప్రజలకు భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button