తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Politics: బస్సు యాత్రకు విశేష స్పందన..13వ రోజు షెడ్యూల్ ఇదే!

వైసీపీ అధినేత, సీఎం జగన్‌ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. మండుటెండను లెక్క చేయకుండా జగన్ ముందుకు కదులుతుండగా.. అంతే ఉత్సాహంతో సీఎం వైఎస్‌ జగన్‌కు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. ఇవాళ 13వ రోజు గుంటూరు జిల్లా ధూళిపాళ్ల నుంచి యాత్ర ప్రారంభమైంది. సత్తెనపల్లి, కోర్రపాడు, మేడికొండూరు, పేరేచెర్ల జంక్షన్, నల్లపాడు మీదుగా హౌసింగ్ బోర్డు దగ్గరకు చేరుకుంటారు. ఆ తర్వాత భోజన విరామం తీసుకుంటారు.

ALSO READ: జనసేనకు స్టార్ క్యాంపెయినర్లు.. జబర్దస్త్ నటులే దిక్కు!

నంబూరు బైపాస్‌ వద్ద బస..

అనంతరం చుట్టుగుంట సర్కిల్, వీఐపీ రోడ్ మీదుగా మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఏటుకూరు బైపాస్ చేరుకుంటారు. అక్కడ జరిగే మేమంతా సిద్ధం బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత తక్కెలపాడు బైపాస్, పెదకాకాని బైపాస్, వెంగళ్‌ రావు నగర్, నంబూరు క్రాస్ మీదుగా ప్రయాణించి నంబూరు బైపాస్‌ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం చేరుకుంటారు.

ALSO READ: నామినేషన్ వేసేందుకు సీఎం జగన్ ముహూర్తం ఫిక్స్! అక్కడే రెండురోజులు మకాం!

గుంటూరు జిల్లా సిద్ధమా..?

సంక్షేమ పాలన అందించిన జననేతకు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారని, నిజాయితీతో, నిబద్ధతతో సుపరిపాలన అందించేందుకే సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర చేపట్టారని పార్టీ నాయకులు అంటున్నారు. యాత్ర దిగ్విజయంగా కొనసాగుతుండడంతో టీడీపీ, జనసేన, బీజేపీ నేతల వెన్నులో వణుకు వస్తుందని ఆరోపిస్తున్నారు. కాగా, సీఎం జగన్ ఇవాళ ట్విట్టర్ వేదికగా 13 వ రోజు గుంటూరు జిల్లా సిద్ధమా..? అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button