తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Memantha Siddham Bus Yatra: మర్రిచెట్టుపాలెంకు చేరుకున్న సీఎం జగన్‌.. వైసీపీలోకి కీలక నేతలు

పల్నాడు జిల్లాలో ఉదయం 9గంటలకు ప్రారంభమైన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర మర్రిచెట్టుపాలెంకు చేరుకుంది. 12వ రోజు యాత్రలో భాగంగా గంటావారిపాలెం నైట్‌ స్టే పాయింట్‌ వద్ద వైసీపీ నేతలు సీఎం జగన్‌ను కలిశారు. బస్సుయాత్రలో పలువురు కీలక నేతలు వైసీపీలో చేరారు. పి.గన్నవరంకు చెందిన జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి, రాయచోటి టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆర్‌ రమేష్‌ కుమార్‌ రెడ్డి, విజయవాడ వెస్ట్‌ జనసేన పార్టీ నియోజక ఇంచార్జ్ ‌పోతిన మహేష్‌ సైతం వైసీపీలో చేరారు.

ALSO READ: చంద్రబాబును నమ్మారు.. దారుణంగా మోసపోయారు!

గజమాలతో జగన్‌కు స్వాగతం

గంటావారిపాలెంలో పార్టీ నేతలకు సీఎం జగన్ దిశానిర్ధేశం చేశారు. అనంతరం పార్టీ నేతలు, సీనియర్‌ కార్యకర్తలను పేరుపేరునా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. దారిపొడవునా సీఎం జగన్‌కు ఆపూర్వ స్వాగతం పలికారు. స్కూల్‌ విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు జై జగన్‌ అంటూ నివాదాలు చేశారు. ఇక సొంతమాగులూరు క్రాస్ రోడ్డు వద్ద భారీ గజమాలతో స్వాగతం పలికారు. కొంతమంది మహిళలు గుమ్మడికాయలతో సీఎం వైఎస్‌ జగన్‌కు దిష్టితీశారు. ఆ తర్వాత భారీగా హాజరైన రొంపిచర్ల గ్రామస్తులు, అభిమానులు, కార్యకర్తల కోసం సీఎం జగన్ బస్సుపైకి ఎక్కి అభివాదం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button