తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Pawan Kalyan: ఢిల్లీ వెళ్లనున్న జనసేనాని పవన్.. కారణం అదేనా?

ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో భాగంగా త్వరలోనే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఢిల్లీకి వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా పొత్తుల విషయంలో బీజేపీతో క్లారిటీ తీసుకోనున్నారు. పవన్‌ కల్యాణ్‌తో భేటీ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏదేమైనా వీలైనంత త్వరలోనే పొత్తులపై టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు.. ఫిబ్రవరి రెండో వారం తర్వాత ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. అయితే, ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోగా పొత్తులపై క్లారిటీకి వచ్చేయాలని మూడు పార్టీల నేతలు భావిస్తున్నారట.

Also read: Pawan Kalyan: జనసేనాని కీలక వ్యాఖ్యలు.. సీట్ల కేటాయింపులో తగ్గేది లేదన్న పవన్

ఏపీలో బీజేపీ- జనసేన పొత్తులో ఉండగా.. ఆ మధ్యే తెలుగుదేశం పార్టీతో జత కట్టాలని జనసేన నిర్ణయానికి వచ్చింది. కానీ, టీడీపీ- జనసేన కూటమితో బీజేపీ కలిసి వస్తుందా? లేదా? అనేదానిపై స్పష్టత లేదు. ఇదే సమయంలో.. జనసేన- బీజేపీ మధ్య పొత్తు ఉందని ఇరు పార్టీల నేతలు చెబుతూ వస్తున్నారు. కానీ, టీడీపీ- జనసేన- బీజేపీ పొత్తుపై క్లారిటీ లేదని.. ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న నేపథ్యంలో.. మూడు పార్టీల పొత్తుపై ఓ నిర్ణయానికి వచ్చే దశగా చర్చలు సాగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button