తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Roja: చంద్రబాబు వద్ద ఊడిగం చేస్తున్నావ్… పవన్ పై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు

టీడీపీతో పొత్తులో భాగంగా జనసేన పార్టీ 24 అసెంబ్లీ సీట్లు, 3 లోక్ సభ స్థానాలకు అంగీకరించడం పట్ల పవన్ కల్యాణ్ తాడేపల్లిగూడెం సభలో సొంత క్యాడర్ కు వివరించే ప్రయత్నం చేశారు. మనకు పోల్ మేనేజ్ మెంట్ ఉందా? టీడీపీలాగా మనకు సంస్థాగత బలం ఉందా? జగన్ లా వేల కోట్లు ఉన్నాయా? బూత్ లెవల్లో మనకు కార్యకర్తలున్నారా?… ఇవన్నీ ఆలోచించే 24 సీట్లకు ఒప్పుకున్నానని పవన్ వెల్లడించారు. ఈ క్రమంలో సీఎం జగన్ ను అథఃపాతాళానికి తొక్కేస్తానంటూ ప్రతిన బూనారు.

Also Read: ధరణి సమస్యలపై దృష్టి… తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

దీనిపై మంత్రి రోజా ఘాటుగా స్పందించారు. జగన్ ఏమీ ఆషామాషీగా ముఖ్యమంత్రి కాలేదని స్పష్టం చేశారు. తిరుగులేని ముఖ్యమంత్రిగా ప్రజల ఆశీస్సులతో ఎలా అయ్యాడు… ఊరికే అయిపోలేదుగా! అని వ్యాఖ్యానించారు. మరి నువ్వు రెండు చోట్ల నిల్చుంటే రెండు చోట్ల గెలవలేకపోయావు అంటే అర్థం చేసుకోవాలని విమర్శించారు. ముష్టి 30 సీట్లు కూడా తెచ్చుకోలేని నువ్వు జగనన్నను అథఃపాతాళానికి తొక్కుతానంటున్నావని… చంద్రబాబు వద్ద ఊడిగం చేస్తూ పవనే అథఃపాతాళానికి వెళ్తాడనే విషయం నిన్నటి సభతో స్పష్టంగా అర్థమైందంటూ రోజా విమర్శనాస్త్రాలు సంధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button