Sajjala Ramakrishna Reddy: చంద్రబాబువి మోసపు మాటలు.. సజ్జల కీలక వ్యాఖ్యలు
వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు ప్రజల ఆశీస్సులు మెండుగా ఉన్నాయని ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజలకు మంచి చేసినందున ఇప్పుడు బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ సీఎంగా జగన్కు మద్దతు తెలుపుతారని వెల్లడించారు.
ALSO READ: తమిళనాడులో తీవ్ర విషాదం.. ఎంపీ ఆత్మహత్య
చంద్రబాబుకి సిగ్గు రాలేదు..
చంద్రబాబుకి ఇంకా సిగ్గు రాలేదని, మళ్లీ అవే మోసపు మాటలు చెబుతున్నాడని విమర్శించారు. తనకున్న అవలక్షణాలు జగన్ కు ఆపాధించాలని చూస్తున్నారన్నారు. కాగా, సీఎం కార్యాలయానికి వచ్చిన కంటైనర్ కి ఎన్నికల సంఘం అనుమతి ఉందన్నారు. సీఎం జగన్ బస్సు యాత్రలో ప్యాంట్రీ కోసం ఆర్టీసీ నుంచి కంటైనర్ తీసుకున్నాం అని క్లారిటీ ఇచ్చారు. కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, వీళ్ల పద్దతి చూస్తుంటే పార్టీ ఆఫీస్లో కూడా ఏదో ఉంది అని యాగి చేస్తారన్నారు.
One Comment