MDMK: తమిళనాడులో తీవ్ర విషాదం.. ఎంపీ ఆత్మహత్య
సార్వత్రిక ఎన్నికల వేళ తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే నేత గణేశ్ మూర్తి (77) మృతి చెందారు. టికెట్ రాలేదనే ఆవేదనతో ఆయన ఆత్మహత్యా యత్నానికి పాల్పడి మార్చి 24న ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఇవాళ ఉదయం ఆయన గుండెపోటుతో మృతిచెందారు.
2019 లోక్సభ ఎన్నికల సమయంలో డీఎంకే (DMK) కూటమిలో ఎండీఎంకే (MDMK)కు ఈరోడ్ స్థానం దక్కింది. గణేశ్ మూర్తి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లో కూటమి సర్దుబాట్లలో భాగంగా ఎండీఎంకేకు తిరుచ్చి కేటాయించగా.. అక్కడి నుంచి దురైవైగోను పార్టీ తమ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో గణేశమూర్తి తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారు.
ALSO READ: రెండో విడత నోటిఫికేషన్ విడుదల.. 88 పార్లమెంట్ స్థానాల్లో నామినేషన్లు!
1947 జూన్లో జన్మించిన గణేశ్ మూర్తి.. 1993లో ఎండీఎంకే ప్రారంభమైనప్పటి నుంచి ఇదే పార్టీలో ఉన్నారు. 1998లో తొలిసారిగా పళని లోక్సభ స్థానం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి శాసనసభ సభ్యుడిగా వ్యవహరించిన ఆయన.. 2009లో ఈరోడ్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.
2 Comments