Kerala: కేరళ సీఎం కూతురిపై ఈడీ కేసు నమోదు
కేరళ సీఎం పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్కు షాకిచ్చింది. ఆమె నిర్వహిస్తున్న ఐటీ కంపెనీలపై ఈడీ అధికారులు మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేశారు. ఆమె కంపెనీకి ఓ సంస్థ అక్రమ చెల్లింపులు చేసిందనే ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కొచ్చికి చెందిన కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ (CMRL) అనే ప్రైవేట్ కంపెనీకి, వాణి విజయన్ సంస్థ ఎక్సాలాజిక్ సొల్యూషన్ల మధ్య వ్యాపార ఒప్పందం జరిగింది. ఎటువంటి సేవలు అందించనప్పటికీ 2017- 2018 మధ్య కాలంలో సీఎంఆర్ఎల్.. ఎక్సాలాజిక్ సొల్యూషన్స్కి రూ.1.72 కోట్ల చెల్లింపులు జరిపిందని ఈడీ ఆరోపిస్తోంది.
ALSO READ: తమిళనాడులో తీవ్ర విషాదం.. ఎంపీ ఆత్మహత్య
ఈడీ అధికారుల తీరుపై కేరళలోని సీపీఐ శ్రేణులు తీవ్ర నిరసన వ్యక్తంచేస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలపై కక్షపూరిత చర్యలకు దిగుతోందని ఆరోపిస్తున్నారు. కాగా.. ఇటీవల లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
2 Comments