CM Mamata: బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్ వ్యాఖ్యలపై ఈసీ సిరీయస్… కేసు నమోదు
పశ్చిమ బెంగాల్కు చెందిన సీనియర్ బీజేపీ నేత, ఎంపీ దిలీప్ ఘోష్పై కేసు నమోదైంది. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు భారత శిక్షాస్మృతిలోని 504, 509 సెక్షన్ల కింద దుర్గాపూర్ పీఎస్లో కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దీదీపై దిలీప్ ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Also Read: కేరళ సీఎం కూతురిపై ఈడీ కేసు నమోదు
ఎన్నికల సందర్భంగా ఏ రాష్ట్రానికి వెళ్తే ఆ రాష్ట్రం కుమార్తెనని మమతా బెనర్జీ చెపుతున్నారని, ఇంతకీ ఆమె తండ్రి ఎవరో స్పష్టం చేయాలని వ్యాఖ్యానించారు. దిలీప్ వ్యాఖ్యలు రాజకీయంగా, వ్యక్తిగతంగా తీవ్ర దుమారం రేపాయి. ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై టీఎంసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఈసీకి ఫిర్యాదు కూడా చేసింది. మరోవైపు టీఎంసీ ఫిర్యాదు మేరకు దిలీప్ ఘోష్కు ఈసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తాము పంపిన షోకాజ్ నోటీసులకు ఈ నెల 29 సాయంత్రం లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
One Comment