తెలుగు
te తెలుగు en English
జాతీయం

Lok Sabha Elections: రెండో విడత నోటిఫికేషన్‌ విడుదల.. 88 పార్లమెంట్‌ స్థానాల్లో నామినేషన్లు!

సార్వత్రిక పోరులో రెండో విడత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. గురువారం ఉదయం రెండో దశ ఎన్నికల్లో భాగంగా 88 స్థానాలకు నోటిఫికేషన్‌ను ఈసీ విడుదల చేసింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్‌సభ స్థానాలతో పాటు ఔటర్‌ మణిపూర్‌లోని ఒక స్థానానికి ఏప్రిల్‌ 26న పోలింగ్‌ జరగనుంది. కాగా, ఏప్రిల్‌ 4 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు.

ALSO READ: సీఎం జగన్‌ బస్సు యాత్ర.. తండోపతండాలుగా తరలివచ్చిన ప్రజానీకం

జమ్ము కశ్మీర్‌ మినహా 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన ఏప్రిల్‌ 5న జరగనుంది. జమ్మలో మాత్రం ఏప్రిల్‌ 6న నామపత్రాలను పరిశీలించనున్నారు. రెండో విడతలో అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, జమ్ముకశ్మీర్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్తాన్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మణిపూర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. వీటితోపాటు మహారాష్ట్రలోని అకోలా పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం, రాజస్తాన్‌లోని భాగిడోరా అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button