సార్వత్రిక ఎన్నిల పోలింగ్కి మరో రెండు వారాలు మాత్రమే మిగిలి ఉంది. నిన్న మేనిఫెస్టో ప్రకటనతో ఎన్నికల రణభేరిని మోగించిన సీఎం జగన్మోహన్ రెడ్డి.. ఇవాళ్టి నుంచి ప్రచారంలో మరింత జోరు పెంచనున్నారు. మొన్నటి దాకా ‘సిద్ధం’, ‘మేమంతా సిద్ధం’ సభలతో అటు పార్టీ శ్రేణులు, ఇటు ప్రజలకు దగ్గరైన జగన్, ఇప్పుడు వరుస సభలతో ప్రజలకు మరింత చేరువకానున్నారు. ఇవాళ సీఎం జగన్ మొత్తం మూడు సభల్లో పాల్గొననున్నారు.
ALSO READ: గత పథకాలకు మళ్లీ చోటు.. మేనిఫెస్టోను విడుదల చేసిన జగన్!
టార్గెట్ @ 175
రాష్ట్రంలో 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 లోక్సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలోని వైఎస్సార్ సర్కిల్లో ఉదయం 10 గంటలకు నిర్వహించే బహిరంగ సభతో సీఎం జగన్ ఎన్నికల ప్రచార భేరి మోగించనున్నారు. అనంతరం మ.12.30కు తిరుపతి లోక్సభ స్థానం పరిధిలోని వెంకటగిరిలోని త్రిభువని సర్కిల్లో నిర్వహించే బహిరంగ సభలోనూ ఆయన పాల్గొంటారు. తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు నెల్లూరు లోక్సభ స్థానం పరిధిలోని కందుకూరు కేఎంసీ సర్కిల్లో జరిగే సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు.
ALSO READ: టీడీపీ కూటమిలో మొదలైన ఓటమి భయం!
సర్వేలన్నీ వైసీపీకే అనుకూలం!
రానున్న ఎన్నికల్లో వైసీపీనే మరోసారి అధికారంలోకి వస్తుందని ఇప్పటి వరకు వెలువడిన అన్ని సర్వేలు స్పష్టంచేస్తున్నాయి. టైమ్స్ నౌ, జన్ కీ బాత్, పోల్ స్ట్రాటజీ గ్రూప్, ది పయోనీర్, స్వతంత్య్ర టీవీ వంటి సర్వేలన్నీ వైసీపీనే మళ్లీ అధికారం చేపడుతుందని అంచనా వేశాయి. కూటమికి కేవలం 40 – 50 స్థానాలు మాత్రమే వస్తాయని స్పష్టంచేశాయి. ఈ నేపథ్యంలో దీంతో కూటమి నేతలు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, ఓటమి భయంతో కొంతమంది టీడీపీ నేతలు ప్రచారానికి కూడా వెళ్లడం లేదని వార్తలు వస్తున్నాయి.
One Comment