YCP: రాష్ట్రంలో ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’ అమలు కావడం లేదు: మంత్రి ధర్మాన
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ టీడీపీ కూటమి నేతలు దిగజారి ప్రవర్తిస్తున్నారు. మొన్నటి దాకా పెన్షన్ల పంపిణీ విషయంలో వైసీపీ మీద, వాలంటీర్ల మీద విషం కక్కి విలన్లుగా మారారు. ఇప్పుడు ప్రభుత్వం మీద అసత్య ఆరోపణలు చేస్తూ రైతుల దృష్టిలోనూ విలన్లుగా మారిపోయారు. రైతుల భూ సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై విపక్షాలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయి. ఈ చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూముల్ని లాగేసుకుంటోందని కూటమి నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారు. అయితేే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అసలు రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్నే అమలు చేయడం లేదు.
ALSO READ: ‘గాజు గ్లాసు’ గుర్తును ఫ్రీ సింబల్గా ప్రకటించిన ఈసీ
‘ఇది బీజేపీ తెచ్చిన చట్టం’
ఇదే విషయంపై మంత్రి ధర్మాన ప్రసాదరావు మరోసారి స్పష్టతనిచ్చారు. భూములపై కొత్త టైటిలింగ్ యాక్ట్ తీసుకురావాలన్నది కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయమని చెప్పారు. ఈ చట్టాన్ని అమలు చేయాలని రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి తీసుకొస్తోందని, కానీ తాము మాత్రం అమలు చేయడం లేదని స్పష్టంచేశారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఏకాభిప్రాయం కుదిరిన అనంతరం, ఈ చట్టం వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు ఏంటని స్పష్టత వచ్చాకే దీన్ని అమలు చేస్తామని అన్నారు. అంతేకాదు, ఈ చట్టానికి న్యాయస్థానాల నుంచి కూడా క్లియరెన్స్ రావాల్సి ఉందని, అప్పుడే దాని అమలు గురించి ఆలోచిస్తామని కేంద్రానికి చెప్పినట్లు ధర్మాన నిన్న జరిగిన మీడియా సమావేశంలో స్పష్టతనిచ్చారు.
ALSO READ: తీరు మార్చుకోని చంద్రబాబు.. పెన్షన్దారులకు తప్పని ఇబ్బందులు!
చట్టం తెచ్చిన బీజేపీతో బాబుకి పొత్తు ఎందుకు?
అయితే కూటమి నేతలు మాత్రం కావాలనే ఈ విషయంలో ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారు. ఈ చట్టం ద్వారా రైతులకు నిజంగా నష్టం కలిగితే, మరి ఈ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన కేంద్రంలోని బీజేపీతో చంద్రబాబు ఎందుకు పొత్తు పెట్టుకున్నట్టు? తిరిగి ఇప్పుడు వైసీపీని ఇందుకు విమర్శిస్తున్నట్టు? వీటికి చంద్రబాబే సమాధానం చెప్పాలి. ఎన్నికల సమయంలో ప్రజల్ని తప్పుత్రోవ పట్టించడం, అబద్ధాలతో, మోసపూరిత మాటలతో ప్రజల్ని గందరగోళానికి గురిచేయడం వెన్నతో పెట్టిన విద్యే. కానీ రాష్ట్ర ప్రజలు టీడీపీ కూటమి చేసే కుయుక్తుల్ని నిశితంగా గమనిస్తున్నారు. సమయం చూసి దెబ్బ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.