తెలుగు
te తెలుగు en English
జాతీయం

Bharat Ratna: అద్వానీకి భారతరత్న… ఇంటికెళ్లి ప్రదానం చేసిన రాష్ట్రపతి

బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారతరత్న ప్రదానం చేశారు. అనారోగ్యం కారణంగా స్వయంగా రాష్ట్రపతి అద్వానీ ఇంటికెళ్లి పురస్కారం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఐదుగురికి భారతరత్న అవార్డులను ప్రకటించింది. వారిలో తెలంగాణ తేజం, దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్.. అలాగే, ఎమ్ఎస్ స్వామినాథన్, బీహార్ మాజీ సీఎం, కర్పూరి ఠాకూర్ కు మరణానంతరం భారతరత్న అవార్డు వరించింది. మార్చి 30న రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారతరత్న అవార్డులను అందజేశారు.

Also Read: కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, కావ్య

పీవీ నరసింహరావు తరఫున ఆయన కుమారుడు ప్రభాకర్ రావు,చరణ్ సింగ్ తరఫున ఆయన మనవడు జయంత్ సింగ్ అవార్డును అందుకున్నా రు. ఇక స్వామినాథన్, కర్పూరి ఠాకూర్ తరఫున వారి కుటుంబ సభ్యులు అవార్డును అందుకున్నారు. అనారోగ్య కారాణల వల్ల రాష్ట్రపతి ముర్ము , ప్రధాని మోదీ ఎల్కే అద్వానీ ఇంటికి వెళ్లి అవార్డును ప్రదానం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button