తెలుగు
te తెలుగు en English
జాతీయం

BJP: లోక్ సభ ఎన్నికలకు దూకుడు పెంచిన బీజేపీ.. 27 మందితో మేనిఫెస్టో కమిటీ

లోక్ సభ ఎన్నికలకు బీజేపీ దూకుడు పెంచేసింది. ఇప్పటికే అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేసిన కమలం పార్టీ .. తాజాగా మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేసింది. కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన 27 మందితో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కమిటీని ఏర్పాటు చేశారు. మేనిఫెస్టో ప్యానెల్ కన్వీనర్‌గా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను నియమించగా, కో-కన్వీనర్‌గా పీయూష్ గోయల్ ను నియమించారు.

కాగా 27 మంది సభ్యుల ఎన్నికల మేనిఫెస్టో కమిటీలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయుశ్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, అశ్విని వైష్ణవ్, స్మృతి ఇరానీ, రాజీవ్ చంద్రశేఖర్, కిరణ్ రిజిజు, అర్జున్ ముండా తదితరులు సభ్యులుగా ఉన్నారు. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది.

మరోవైపు కర్ణాటక లోక్‌సభ ఎన్నికలకు 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బీజేపీ శనివారం విడుదల చేసింది. ప్రధాని మోడీ, అమిత్ షా, కె అన్నామలై రాష్ట్రంలోని ఇతర పార్టీల నేతలతో కలిసి బీజేపీ తరపున ప్రచారం చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button