India: రాబోయే పాతికేండ్లలో భారత్ను వికసిత్ రాజ్యంగా ఆవిష్కరిస్తాం: మోదీ
భారత్ను అంతర్జాతీయ ఎగుమతుల హబ్గా మారుస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలో భారత్ టెక్స్ 2024ను ప్రారంభిస్తూ ప్రధాని మాట్లాడారు. ఈ కార్యక్రమానికి 100 దేశాల నుంచి మూడు వేల మందికి పైగా ఎగ్జిబిటర్లు, కొనుగోలుదారులు, 40 వేల మంది వాణిజ్య సందర్శకులు హాజరయ్యారు. రాబోయే పాతికేండ్లలో భారత్ను తాము వికసిత్ రాజ్యంగా ఆవిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
Also Read: 35 ఏళ్ల పాలనలో కుప్పానికి ఏమైనా మంచి జరిగిందా?
పేదలు, యువత, రైతులు, మహిళల సంక్షేమం లక్ష్యంగా వికసిత్ భారత్ స్వప్నం సాకారమవుతుందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యల ఫలితంగా భారత టెక్స్టైల్ రంగంలోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరిగిందని చెప్పారు. 2014తో పోలిస్తే ప్రస్తుతం టెక్స్టైల్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) రెట్టింపయ్యాయని ప్రధాని మోదీ వెల్లడించారు.
Also Read: రాష్ట్ర ప్రజలకు శుభవార్త.. సీఎం కీలక నిర్ణయం
దేశంలో జౌళి పరిశ్రమ అభివృద్ధికి తమ ప్రభుత్వం పలు చర్యలు చేపడుతుందని వివరించారు. 2014లో దేశంలో టెక్స్టైల్ మార్కెట్ విలువ 7 లక్షల కోట్ల కంటే తక్కువగా ఉండగా, ప్రస్తుతం ఆ విలువ 12 లక్షల కోట్లకు పెరిగిందని చెప్పారు. గత పదేండ్లలో నూలు, దుస్తులు, అపెరల్ ఉత్పత్తి ఏకంగా 25 శాతం పెరిగిందని తెలిపారు. ప్రభుత్వ జోక్యం తక్కువగా ఉన్న సమాజాన్ని సృష్టించడమే తన లక్ష్యమని తెలిపారు. ఇది ప్రజల శ్రేయస్సుకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుందన్నారు.
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good.