Lok Sabha elections: బీఎస్పీకి బిగ్ షాక్.. పార్టీకి రాజీనామా చేసిన ఎంపీ రితేష్ పాండే
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్వాదీ పార్టీ(బీఎస్పీ)కి ఎంపీ రితేష్ పాండే బిగ్ షాక్ ఇచ్చారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ఎంపీ రితేష్ పాండే వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో ఆయన బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు మొదలయ్యాయి. కాగా, ఆయన ఉత్తరప్రదేశ్లోని అంబేద్కర్నగర్ నుంచి లోక్సభ బీఎస్పీ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు.
ALSO READ: దేశంలో అతిపెద్ద కేబుల్ బ్రిడ్జ్… సుదర్శన్ సేత్ ప్రారంభించిన మోదీ
బీఎస్పీ పార్టీ నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు
‘ఎన్నికల్లో సహకారం అందించిన బీఎస్పీ నేతలు,కార్యకర్తలకు ధన్యవాదాలు. పార్టీలో కొంతకాలంగా గుర్తింపు లభించడం లేదు. సమావేశాల్లోనూ సీనియర్ నేతలు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతోపాటు పట్టించుకోవడంలేదు. నాసేవలు పార్టీకి అవసరం లేదనుకొని పార్టీకి రాజీనామా చేస్తున్నా’ అని ఎంపీ ట్విట్టర్ వేదికగా తెలిపారు. కాగా, 10 రోజుల క్రితం ప్రధాని నరేంద్రమోదీని పాండే కలిసిన సంగతి తెలిసిందే.