తెలుగు
te తెలుగు en English
జాతీయం

Sumalatha: కాషాయం గూటికి ఎంపీ సుమలత.. ఎన్నికల్లో పోటీచేయనని వెల్లడి

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నటి, ఎంపీ సుమలత అంబరీష్ పోటీ చేయడం లేదు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ప్రకటించారు. దీంతో పాటుగా బీజేపీలో చేరుతున్నట్లుగా కూడా స్పష్టం చేశారు. మాండ్యలో మద్దతుదారుల సమావేశంలో సుమలత మాట్లాడుతూ .. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని, ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్నట్లు చెప్పారు.

Also read: ECI: ఎన్నికల అభ్యర్థులకు ఈసీ ఝలక్.. ఇక నుంచి కొత్త రూల్స్

దీని ద్వారా జేడీఎస్ అభ్యర్థి, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామికి ఆమె మద్దతు పలికారు. మాండ్య ప్రజలు తనకు అమ్మ స్థానం ఇచ్చారని, ఈ తల్లిని బిడ్డలకు ఎప్పటికీ దూరం చేయలేరని భావోద్వేగంతో మాట్లాడారు. 2019 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా మాండ్య లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసిన సుమలత భారీ మెజార్టీతో ఎంపీగా గెలిచారు. ఏప్రిల్ 6న బీజేపీలో చేరుతున్నట్లు సుమలత ప్రకటించారు.

మాండ్య లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర ఎంపీగా గెలిచిన సుమలత బీజేపీకి మద్దతిస్తూ వస్తున్నారు. ఆమె మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే ఈ ఎన్నికల్లో జేడీఎస్‌తో పొత్తు పెట్టుకున్న బీజేపీ ఈ సీటును జేడీఎస్‌కు కేటాయించింది. పార్లమెంట్ ఎన్నికల తరువాత సుమలతకు బీజేపీ మంచి పదవి, హోదా కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button