తెలుగు
te తెలుగు en English
జాతీయం

Tamilanadu: లోక్‌సభ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న కమల్‌ హాసన్

తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఆ రాష్ట్రంలో కొత్త పొత్తు పొడిచింది. ప్రముఖ తమిళ హీరో, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్.. అధికార పార్టీ అయిన ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)కు ఈ లోక్‌సభ ఎన్నికల్లో మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఇవాళ సీఎం ఎంకే స్టాలిన్‌తో భేటీ అయిన కమల్ హాసన్ ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు.

ALSO READ: ఏ పార్టీతో పొత్తు లేదు.. ఒంటరిగానే బరిలోకి దిగుతాం: మాయావతి

సీఎంతో భేటీ అనంతరం కమల్ మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని ప్రకటించారు. తమిళనాడులో అధికార డీఎంకే, కాంగ్రెస్‌ ఏర్పాటు చేసుకున్న తన పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. 2025 రాజ్యసభ ఎన్నికల్లో ఎంఎన్‌ఎం పార్టీకి ఒక రాజ్యసభ స్థానం ఇచ్చేందుకు డీఎంకే నేతృత్వంలోని కూటమి అంగీకరించిన నేపథ్యంలో కమల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒప్పందంలో భాగంగా తమిళనాడులోని 39 లోక్‌సభ స్థానాలు, పుదుచ్చేరిలోని ఒక స్థానంలో కూటమి తరఫున ఎంఎన్‌ఎం పార్టీ ప్రచారం చేయనుంది

3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button