Bandla Ganesh: ఎన్నికల్లో బరిలోకి బండ్ల గణేశ్.. ఎంపీగా పోటీకి దరఖాస్తు
టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేందుకు రెడీ అయ్యారు. తాజాగా పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీ చేసేందుకు ఆయన దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున 2024 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయటానికి అవకాశం కల్పించాలని శుక్రవారం తన దరఖాస్తును గాంధీభవన్ లో సమర్పించారు.
Also read: CM Jagan: ఈనెల 3న దెందులూరులో సిద్ధం సభ.. వైసిపి నేతల ఏర్పాట్లు
రెండు నెలల క్రితమే రేవంత్ రెడ్డి పాలన అద్భుతంగా ఉందని.. రాబోయే ఎంపీ సీట్లు అన్నీ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని బండ్ల గణేశ్ ధీమా వ్యక్తం చేశారు. మతి భ్రమించిన మల్లారెడ్డి పిచ్చి పిచ్చి ఆరోపణల చేస్తున్నారని.. ఫీజుల రూపంలో విద్యార్థుల రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్నాడంటూ తీవ్రంగా మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పాలన చూసి కాంగ్రెస్ కార్యకర్తగా గర్వపడుతున్నానని.. మల్కాజిగిరి నుంచి పోటీ చేయటానికి పార్టీ అవకాశం ఇస్తే.. కచ్చితంగా గెలుస్తాననే నమ్మకం ఉందన్నారు.