Congress: యువతకు పార్టీలో ప్రాధాన్యం పెరిగింది: అనిల్ కుమార్ యాదవ్
కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా యువనేత అనిల్ కుమార్ యాదవ్, ఖమ్మం జిల్లాకు చెందిన ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అధిష్టానం నిర్ణయంపై అనిల్ కుమార్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ కష్టపడేవారికే పదవులు దక్కుతాయని, అందుకు తానే నిదర్శనమని అన్నారు. తనకు రాజ్యసభ అవకాశం ఇస్తారని ఊహించలేదని అన్నారు.
ALSO READ: బీజేఎల్పీ నేతగా ఏలేటీ మహేశ్వర్ రెడ్డి… రాజాసింగ్ మినహా అందరికీ పదవులు
సీఎం రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన తర్వాత యువతకు పార్టీలో ప్రాతినిథ్యం పెరిగిందని అన్నారు. తనలాంటి యువకుడికి అధిష్ఠానం.. పెద్దల సభకు అవకాశం ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. ఈ పదవి యూత్ కాంగ్రెస్ కార్యకర్తల కృషి ఫలితమేనని చెప్పారు. కొత్తరక్తాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడమే రాహుల్ గాంధీ లక్ష్యమని చెప్పారు. పార్టీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తెలంగాణ ప్రయోజనాల కోసం రాజ్యసభలో తన గొంతును వినిపిస్తానన్నారు.