KTR: స్వేద పత్రం ఎఫెక్ట్… సిరిసిల్ల ప్రజల గోడు పత్రం రిలీజ్ చేయాలని డిమాండ్
మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కు BJP రాష్ట్ర అధికార ప్రతినిధి , సిరిసిల్ల BJP శాసన సభ ఎన్నికల అభ్యర్థి రాణీ రుద్రమ కొన్ని ప్రశ్నలను సంధించారు. ప్రస్తుతం ఆమె X లో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. ఇందులో ఆమె స్వేద పత్రం పేరుతో కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడాన్ని గుర్తుచేయడంతో పాటు సిరిసిల్ల ప్రజల గోడు పత్రం రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.
Also Read: లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ… డబుల్ డిజిట్ సీట్లు గెలుస్తాం: కిషన్ రెడ్డి
సిరిసిల్ల లో KTR వారి బంధువులు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్న ఇసుక మాఫియా పైన కూడా ఒక స్వేద పత్రం సిరిసిల్ల లో విడుదల చేయాలని కోరారు. నేరెళ్ళలో వారి గత పాలనలో దాష్టీకానికి గురై నేటికీ అష్టకష్టాలు పడుతున్న దళితులను ఎవరు వేదిస్తున్నారు, అసలు ఇసుక టెండర్ ల కాంట్రాక్టర్ లు ఎవరు , ఇప్పటిదాకా ఎన్ని వేల కోట్లు దోపిడీ చేశారో పూర్తి వివరాలతో MLA హోదా లో KTR ఒక ఇసుక దోపిడీ పత్రం సిరిసిల్ల లో రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.
Also Read: సీఎం రేవంత్ రెడ్డి తో మెగాస్టార్ భేటీ… సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్
KTR… MLA, మంత్రి గా ఉన్నప్పటి నుండి నేటి వరకు అగ్రహారం అంజన్న మట్టి ని దోచుకుంటున్న దొంగల పై ఒక మైనింగ్ మాఫియా పత్రం… BRS పార్టీ నాయకులే కాంట్రాక్టర్లు గా ఉండి కట్టిన 42 చెక్ డ్యాం లలో 22 ఒక్క వానకే ఎందుకు కూలి పోయినయో , ఇంకా ఆ కాంట్రాక్టర్ పైన ఎందుకు FIR కూడా నమోదు కాలేదో పూర్తి వివరాలతో ఒక అవినీతి పత్రం సిరిసిల్ల లో రిలీజ్ చేయాలని కోరారు.
Also Read: బీఆర్ఎస్ పై విజయశాంతి సెటైర్లు… భవిష్యత్ రహిత సమితి అంటూ ఎద్దేవా
సెస్ లో 40 కోట్ల కుంభకోణం చేసి ఫైళ్లు తగలపెట్టిన వారెవరో బయటకు తీసి సిరిసిల్ల లో అవినీతి దొంగల చిట్టా తెలియజేయాలని… బతుకమ్మ చీరల పేరుతో MAC సంఘాల రిజిస్టర్ లు, చెక్ బుక్ లు… సంఘాలు, కార్మికుల వద్ద లేకుండా ఎవరు లాక్కుని ప్రభుత్వ సొమ్మును స్వాహా చేశారో నేత కార్మికుల కష్టాన్ని దోచుకున్న బతుకమ్మ చీరల అవినీతి బాగోతం పత్రాన్ని సిరిసిల్ల లో రిలీజ్ చేయాలని ఈ సందర్బంగా ఆమె డిమాండ్ చేశారు.