Pinapaka: తుఫాన్ లో కేసీఆర్ కొట్టుకుపోతాడు: రాహుల్ గాంధీ
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) కాంగ్రెస్ పార్టీదే విజయమని ఆ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తుఫాన్ లో కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ కొట్టుకుపోతుందని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఖమ్మం జిల్లా పినపాకలో (Pinapaka) రాహుల్ పర్యటించారు.
Also Read గీత, ఖురాన్, బైబిల్ వంటిది మేనిఫెస్టో: రేవంత్ రెడ్డి
రోడ్ షోలో అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లుకు మద్దతుగా రాహుల్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణలో 24 గంటల విద్యుత్ ఒక్క కేసీఆర్ నివాసంలో మాత్రమే వస్తోంది. మాది కుటుంబ పాలన కాదు.. ప్రజా ప్రభుత్వం. 20 లక్షల మది రైతులను ధరణి (Dharani Portal) పేరుతో బీఆర్ఎస్ మోసం చేసింది. పదేళ్లుగా తెలంగాణను (Telangana) దోచుకున్నారు.. వారి దోపిడీకి అంతం పలికే రోజు దగ్గర పడింది. కేసీఆర్ అవినీతిని ప్రజలకు పూర్తిగా అర్థమైంది. అసలు కాంగ్రెస్ ఏం చేసిందని కేసీఆర్ ప్రశ్నిస్తున్నాడు. అసలు రాష్ట్రం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ’ అని స్పష్టం చేశారు.
Also Read కాంగ్రెస్ కు జై కొట్టు.. కేసీఆర్ ను ఓడగొట్టు
గెలిపిస్తే కులగణన
‘హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి. అధికారంలోకి (Power) రాగానే మేం ఇచ్చిన 6 గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తాం. ప్రతి నెలా మహిళల ఖాతాల్లో రూ.2,500 వేస్తాం. అలాగే కుల గణన (Caste Census) జరిపించి తీరుతాం’ అని రాహుల్ తెలిపారు.