తెలుగు
te తెలుగు en English
క్రికెట్

ICC: ఐర్లాండ్, వెస్టిండీస్ క్రికెట‌ర్లకు ఐసీసీ అవార్డు

వెస్టిండీస్ యువ పేస‌ర్ షమార్‌ జోసఫ్‌‌కు 2024 జనవరికి గానూ ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డు వరించింది. గత నెలలో గ‌బ్బా టెస్టులో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకు ఈ అవార్డు గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 7 వికెట్లు తీసి విండీస్‌కు చిర‌స్మ‌ర‌ణీయ విజ‌యం అందించాడు. దీంతో ఒక్కసారిగా హీరో అయిన జోసెష్.. తొలి సిరీస్‌తోనే ఐసీసీ అవార్డు గెలిచాడు. జ‌న‌వ‌రి నెల‌కు గానూ ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్’ అవార్డు సొంతం చేసుకున్నాడు.

ALSO READ: టీమిండియాకు భారీ షాక్.. మూడో టెస్ట్ నుంచి అశ్విన్ ఔట్

అమీ హంటర్‌ వరించిన అవార్డు

మహిళల విషయానికొస్తే.. ఈ విభాగంలో జనవరి ఐసీసీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’ అవార్డును అమీ హంట‌ర్(ఐర్లాండ్) దక్కించుకుంది. గత నెలలో అద్భుత ప్రదర్శనల నేపథ్యంలో అమీ హంటర్‌ ఈ అవార్డుకు ఎంపికైంది. అమీతో పాటు ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డు కోసం ఆస్ట్రేలియా ప్లేయ‌ర్లు బెత్ మూనీ, అలీసా హేలీపోటీపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button