Jayasurya: శ్రీలంక క్రికెట్ టీం కన్సల్టెంట్గా సీనియర్ ఆటగాడు
శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్యకు ఆ దేశ క్రికెట్ బోర్డు కీలక పదవి అప్పజెప్పింది. ఈ మేరకు ఆయనను శ్రీలంక క్రికెట్ జట్టుకు ఓ ఏడాది పాటు కన్సల్టెంట్గా నియమించింది. కాగా, ఈ ఎంపిక తక్షణమే అమలుకానుందని లంక బోర్డు తెలిపింది. దీంతో లంక క్రికెట్ బోర్డుకు సంబంధించిన క్రికెటర్లు, కోచ్లను పరిశీలించనున్నారు. అదే విధంగా సలహాలు, సూచనలతోపాటు కోచింగ్ స్టాఫ్ను కూడా మానిటర్ చేయనున్నారు.
ALSO READ: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇక ఆ జెర్సీ ఎవరికీ ఇవ్వరు
జయసూర్యపై రెండేళ్ల బ్యాన్
జయసూర్య 1991-2011 మధ్యలో లంక క్రికెట్ జట్టుకు ఎన్నో అపురూపమైన విజయాలు అందించాడు. ఆయన తన సహచరుడు కలువితరణతో కలిసి ప్రపంచ క్రికెట్కు విధ్వంసకర బ్యాటింగ్ను పరిచయం చేశాడు. కాగా, 2019లో జరిగిన ఐసీసీ యాంటీ కరప్షన్ యూనిట్ విచారణలో వచ్చిన ఆరోపణలు అంగీకరించడంతో ఆయనను రెండేళ్లు బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన గతంలో రెండుసార్లు శ్రీలంక చీఫ్ సెలెక్టర్గా చేశాడు.