తెలుగు
te తెలుగు en English
క్రికెట్

LSG vs RCB: ఆర్సీబీకి మరో ఓటమి..హడలెత్తించిన లక్నో పేస్‌ బౌలర్‌

ఐపీఎల్ 2024లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు వరుసగా మూడోసారి ఓటమి పాలైంది. మంగళవారం లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 28 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన లక్నో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఓపెనర్‌ డికాక్‌ (56 బంతుల్లో 81; 8 ఫోర్లు, 5 సిక్స్‌లు), పూరన్‌ (21 బంతుల్లో 40 నాటౌట్‌; 1 ఫోర్, 5 సిక్స్‌లు) చెలరేగారు.

మూడు పరుగుల వ్యవధిలో మూడు వికెట్లుALSO

లక్నో విధించిన 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. లక్నో యువ ఫాస్ట్‌బౌలర్‌ మయాంక్‌ యాదవ్‌ (3/14) విజృంభించడంతో 19.4 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్లు కోహ్లీ (22), డుప్లెసిస్‌ (19) శుభారంభం అందించారు. కానీ తర్వాత మూడు పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది. కోహ్లిని మణిమారన్‌ ఔట్‌ చేయగా.. డుప్లెసిస్‌ రనౌటయ్యాడు. మ్యాక్స్‌వెల్‌ను మయాంక్‌ యాదవ్‌ డకౌట్ చేశాడు. ఆ తర్వాత గ్రీన్‌ (9)ను మయాంక్‌ బౌల్డ్‌ చేయడంతో ఆర్సీబీ 58 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. కాగా, రజత్‌ పటీదార్‌ (29; 21 బంతుల్లో 2×4, 2×6), అనుజ్‌ రావత్‌ (21 బంతుల్లో 11) పర్వాలేదనిపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button