తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Telangana: కేటీఆర్‌కు భయపడే ప్రసక్తే లేదు… దేనికైనా సిద్ధమే: కొండా సురేఖ

ఫోన్ ట్యాపింగ్ వార్తలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ నేతలు, మంత్రిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అవసరమైతే కోర్టుకు వెళ్తానంటూ హెచ్చరించారు. తనపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు, మంత్రి కొండా సురేఖపై కోర్టుకు వెళ్తానని.. న్యాయపరంగా తనపై చేస్తున్న అబద్ధపు ఆరోపణలు ఎదుర్కొంటానని తెలిపారు.

Also Read: పెన్షన్‌దారులకు గుడ్ న్యూస్..ఏపీ వ్యాప్తంగా రేపటి నుంచి పెన్షన్ల పంపిణీ

అయితే కేటీఆర్ వ్యాఖ్యలకు భయపడే ప్రసక్తే లేదని మంత్రి కొండా సురేఖ అన్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టంచేశారు. లీగల్ నోటీసులు ఇచ్చినా ఎదుర్కొంటామని అందుకు సిద్దంగా ఉన్నామని చెప్పారు. తప్పు చేసిన వారు ఎవరైనా సరే విచారణలో తేలితే తప్పని సరిగా శిక్షకు అర్హులేనని చెప్పారు. కేటీఆర్ భయంతో ఏదేదో దిగజారి మాట్లాడుతున్నారని సురేఖ మండిపడ్డారు.

4 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button