తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

BREAKING: పెన్షన్‌దారులకు గుడ్ న్యూస్..ఏపీ వ్యాప్తంగా రేపటి నుంచి పెన్షన్ల పంపిణీ

ఏపీలో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వం చేపట్టే పలు కార్యక్రమాలు పరోక్షంగా ఓటర్లను ప్రలోభపెట్టే అవకాశముందని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. అందుకే ఎన్నిక‌ల వేళ వృద్దులు, వింతువులు, వికలాంగులకు వాలంటీర్ల ద్వారా నేరుగా అందజేసే పెన్షన్లపై ఈసీ ఆంక్షలు విధించింది.

Also Read: వారికి వెంటనే బిల్లులు చెల్లించండి… సీఎంకు హరీష్ రావు లేఖ

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో వాలంటీర్లపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించింది. ఆసరా పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాలకు, వాలంటీర్లతో డబ్బు పంపిణీ చేయకూడదంటూ సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లను పక్కకు పెట్టాలని ఈసీ ప్రభుత్వానికి సూచించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Also Read: పింఛన్లు ఇవ్వనీయకుండా అడ్డుకుంటావా?

రేపటి నుంచి ఈ నెల 6 వరకు పెన్షన్లను పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అందుకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో భాగంగా దివ్యాంగులు, వృద్ధులు, రోగులకు ఇంటి వద్దకే పెన్షన్ తీసుకెళ్లి అందజేయనున్నారు. మిగతా వారికి గ్రామ, వార్డు సచివాలయాల్లో పంపిణీ చేయనున్నారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు గ్రామ సచివాలయాలు పనిచేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button