తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

CM Revanth: వారికి వెంటనే బిల్లులు చెల్లించండి… సీఎంకు హరీష్ రావు లేఖ

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మందికి పైగా పాడి రైతులు పాల ఉత్పత్తి సహకార సంఘాలుగా ఏర్పడి, ప్రభుత్వం నడిపే విజయ డెయిరీకి ప్రతీ రోజు పాలు సరఫరా చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతీ 15 రోజులకు ఒకసారి పాడి రైతులకు బిల్లులు చెల్లించేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి బిల్లుల చెల్లింపు సకాలంలో జరగడం లేదు. 45 రోజుల పాల బిల్లులు పెండింగులో ఉన్నాయి. దాదాపు రూ.80 కోట్లను ప్రభుత్వం పాడి రైతులకు చెల్లించాల్సి ఉందని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.

Also Read: రూ. 2,000 నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన

బ్యాంకులలో, మహిళా సంఘాలలో, వడ్డీ వ్యాపారుల దగ్గర ఇలా వివిధ మార్గాల ద్వారా అప్పు చేసి పాడి రైతులు పశువులు కొనుగోలు చేశారన్నారు. అప్పుల కిస్తీలు క్రమం తప్పకుండా కట్టుకోవాల్సి ఉందని తెలిపారు. పశువులకు దాణా, మీండ్రాల్ మిక్షర్, కాల్షియం, మందులు ఇతరత్రా సామగ్రి కూడా రోజూ కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు.

Also Read: ఏడేండ్లలో 5,304 రైతుల ఆత్మహత్య … కేసీఆర్ పాలనపై టీ.కాంగ్రెస్ ట్వీట్

ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం వల్ల వారు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించిన మాదిరిగానే ప్రతీ 15 రోజులకోసారి బిల్లులు చెల్లించాలని, పెండింగులో ఉన్న రూ.80 కోట్ల బిల్లులను మొత్తం ఒకేసారి విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button