IPL: బీసీసీఐ కీలక నిర్ణయం… ఐపీఎల్లో రెండు మ్యాచ్లు రీషెడ్యూల్
క్రికెట్ వినోదానికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న ఐపీఎల్ జోరుగా సాగుతోంది. కాగా, ఈ సీజన్ లో రెండు మ్యాచ్ లను రీషెడ్యూల్ చేసినట్టు బీసీసీఐ వెల్లడించింది. కోల్ కతా నైట్ రైడర్స్-రాజస్థాన్ రాయల్స్… గుజరాత్ టైటాన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ల తేదీలను మార్చినట్టు ఓ ప్రకటనలో తెలిపింది.
Also Read: రిషబ్ పంత్కు 12 లక్షల జరిమానా.. ఎందుకంటే?
కోల్ కతా నైట్ రైడర్స్-రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ముందు పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 17న జరగాల్సి ఉంది. అయితే, ఈ మ్యాచ్ ను ఒక రోజు ముందుకు, అంటే ఏప్రిల్ 16కి మార్చారు. ఈ మ్యాచ్ కు కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా నిలవనుంది. మరోవైపు గుజరాత్ టైటాన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ తొలుత పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 16న జరగాల్సి ఉంది. అయితే, ఈ మ్యాచ్ ను ఆ మరుసటి రోజుకు, అంటే ఏప్రిల్ 17వ తేదీకి రీషెడ్యూల్ చేశారు. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.