తెలుగు
te తెలుగు en English
క్రికెట్

Rishabh Pant: రిష‌బ్ పంత్‌కు 12 ల‌క్ష‌ల జ‌రిమానా.. ఎందుకంటే?

ఐపీఎల్ 2024 సీజన్‌ రసవత్తరంగా జరుగుతోంది. ఆదివారం విశాఖపట్నంలోని డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో లీగ్ ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని ఉల్లంఘించినందుకు ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్‌కు భారీ జరిమానా విధించారు. చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో స్లో ఓవ‌ర్ రేట్ కార‌ణంగా లీగ్ చ‌ట్టం ప్ర‌కారం రిష‌బ్ పంత్‌కు 12 ల‌క్ష‌ల జ‌రిమానా విధించారు.

ALSO READ: ఓ వైపు పరుగుల వరద.. మరోవైపు రికార్డుల మోత.. దటీజ్ ధోనీ!

32 బంతుల్లో 51 పరుగులు

ఈ సీజన్‌లో కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలో బరిలోకి దిగిన చెన్నై జట్టు మొదటి సారి ఓడింది. అంతకు ముందు హోమ్ గ్రౌండ్‌లో వరుసగా రెండు విజయాలు సాధించింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జ‌ట్టు 20 ప‌రుగుల తేడాతో చెన్నైపై విజ‌యం సాధించింది. రిష‌బ్ పంత్ ఆ మ్యాచ్‌లో 32 బంతుల్లో 51 ర‌న్స్ చేసి త‌న ఫామ్‌ను చాటుకున్నాడు. ఈ ఎడిషన్‌లో వరుసగా 2 పరాజయాల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి విజయాన్ని నమోదు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button