Bhimaa OTT: ముందుగానే ఓటీటీలోకి రానున్న గోపిచంద్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
టాలీవుడ్లో మాచో స్టార్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ ‘భీమా’. ఈ సినిమాలో గోపీచంద్ రెండు పాత్రల్లో కనిపించగా..ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్గా నటించారు. పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా వచ్చిన భీమాకు కన్నడ డైరెక్టర్ ఏ హర్ష దర్శకత్వం వహించారు. గత నెల మార్చి 8న మహా శివరాత్రి పండుగ సందర్బంగా విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ రావడంతో మంచి కలెక్షన్స్ రాబట్టింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ లాక్ చేసుకుంది.
ALSO READ: ఏప్రిల్ 12 నుంచి ఓటీటీలోకి రానున్న ‘ప్రేమలు’!
నెలరోజులకు ముందుగానే స్ట్రీమింగ్..
గత నెల మార్చి 8న మహా శివరాత్రి పండుగ సందర్బంగా విడుదలైన ఈ సినిమా ముందుగానే ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసింది. అయితే నెలకు మూడు రోజుల ముందుగానే ఓటీటీలోకి వచ్చేస్తోంది. దీంతో ఇప్పుడు ఏప్రిల్ 5న భీమా సినిమాను డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. కాగా, ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్పై నిర్మాత కెకె రాధామోహన్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.