తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Telangana: ఏడేండ్లలో 5,304 రైతుల ఆత్మహత్య … కేసీఆర్ పాలనపై టీ.కాంగ్రెస్ ట్వీట్

తెలంగాణలో త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్దం నడుస్తుంది. కేసీఆర్ రైతుల సమస్యలను తెలుసుకోవడానికి వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ పై తీవ్ర విమర్శలు చేశారు. ఓ వైపు కాంగ్రెస్ పంటలను ఎండబెడుతుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా.. మరో వైపు కారు పార్టీ హయాంలోనే రైతుల ఆత్మహత్యలు అధికంగా జరిగాయని హస్తం పార్టీ చెబుతోంది. ఈ నేపథ్యంలో టీ కాంగ్రెస్ కేసీఆర్ గత పాలనపై ట్విట్టర్ వేదికగా ఫైర్ అయింది.

Also Read: రైతులకు శుభవార్త.. త్వరలో రుణమాఫీ…?

2022లో రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే నాలుగు స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉందని ఆరోపించింది. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఆత్మహత్యలే లేవన్న కేసీఆర్ దీనికేం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. అబద్ధాలు చెప్పడానికి కూడా ఒక హద్దు ఉంటుందని విమర్శించారు. మీరు తెలంగాణ ప్రజలను అబద్దాలతో దశాబ్ద కాలం మోసం చేశారు కాబట్టే మిమ్మల్ని ఓడించి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా అబద్ధాలు మానేసి ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన సమస్యలను లేవనెత్తండని హితవు పలికారు.

Also Read: దేశ చరిత్రలో మహోజ్వల ఘట్టం.. ఐదోరోజు షెడ్యూల్ ఇదే!

అంతేకానీ మీ రాజకీయ స్వలాభాల కోసం రైతులను, తెలంగాణ ప్రజలను మోసం చేయకండని టీ కాంగ్రెస ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌కు ‘ఏడేండ్లలో 5,304 రైతుల ఆత్మహత్య’ రాష్ట్ర పోలీసు శాఖ, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రిపోర్టులో వెల్లడి అనే వార్త క్లిప్పింగ్‌ను జత చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button