Congress: రైతులకు శుభవార్త.. త్వరలో రుణమాఫీ…?
తెలంగాణలోని రైతులకు త్వరలోనే శుభవార్త అందనుంది. లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత రుణమాఫీ ప్రక్రియను ప్రారంభిస్తామని, రుణమాఫీ విషయంలో రైతులెవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంచేశారు. ఇక, రాష్ట్రంలో 64.77 లక్షల మంది రైతులకు రూ.5,574.77 కోట్ల రైతుబంధు సాయాన్ని జమ చేశామని వివరించారు. 92 శాతం మంది రైతులు 5 ఎకరాల్లోపు వారే ఉన్నారని, వారికి ఇప్పటికే రైతుబంధు అందిందని అన్నారు. మిగిలిన వారికి త్వరలో అందిస్తామని అన్నారు.
ALSO READ: చేసిన పాపాలకు కేసీఆర్ పశ్చాత్తాపం పడాల్సిందే… T-కాంగ్రెస్ ట్వీట్
అయితే, రైతుబంధు పథకానికి త్వరలోనే నూతన విధివిధానాలను రూపొందిస్తామని అన్నారు. ఇక నుంచి పంట వేసిన వారికే పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పారు. ఈ మేరకు ప్రజల నుంచి కూడా విజ్ఞప్తులు వచ్చాయని చెప్పారు. శాసనసభలో చర్చించి విధివిధానాలు రూపొందిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం మాదిరి వెంచర్లకు, బండరాళ్లతో నిండిన ప్రదేశాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుబంధు ఇచ్చే ప్రసక్తే లేదని అన్నారు.
One Comment