తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Telangana: చేసిన పాపాలకు కేసీఆర్ పశ్చాత్తాపం పడాల్సిందే… T-కాంగ్రెస్ ట్వీట్

తెలంగాణ రాష్ట్రంలో ఎండిన పంటలను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. మూడు జిల్లాల పర్యటనల సందర్భంగా రైతుల బాధలను కేసీఆర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. రైతులపై ప్రభుత్వానికి ప్రేమ లేదని.. రుణమాఫీ ఏమైందని ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇక, కేసీఆర్ పర్యటనపై టీ కాంగ్రెస్ సెటైరికల్ ట్వీట్ చేసింది.

Also Read: తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందనుకోలేదు: కేసీఆర్

‘పదేళ్ల పాలనలో ఏనాడూ రైతు గోడు వినని, గోస పట్టనోడిని పరుగులు పెట్టించి, ఫామ్ హౌస్‌లో విలాసాలే తప్ప పరామర్శలు తెలియనోడిని ప్రజల మధ్యకు వచ్చేలా చేసింది.. ఇది కదా.. కాంగ్రెస్ తెచ్చిన మార్పు..! అయినా, చంపినోడే సంతాపం తెలిపినట్టు.. పదేళ్లలో ఎనిమిది వేలకు పైగా రైతులను పొట్టనబెట్టుకొని, ఇప్పుడు మొసలి కన్నీళ్లు కారిస్తే సానుభూతి నాటకాలాడితే నీ దొంగ మాటలను ఇంకా నమ్మేవాళ్ళు ఎవరూ లేరు కేసీఆర్.. ఇదే కాదు, తెలంగాణలోని ప్రతిపల్లెకు నువ్వు రావాల్సిందే.. నువ్వు చేసిన పాపాలకు ప్రజల మధ్యకు వచ్చి పశ్చాత్తాపం పడాల్సిందే.. ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందేనని ట్వీట్ చేసింది.

5 Comments

  1. Definitely imagine that which you said. Your favourite justification seemed to be on the internet the easiest
    factor to bear in mind of. I say to you, I certainly get annoyed even as people consider
    concerns that they just do not understand about.
    You managed to hit the nail upon the top as well as defined out the whole thing without having side effect , folks could take
    a signal. Will probably be back to get more. Thanks

    Also visit my page: vpn coupon code 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button