Breaking: ఢిల్లీ లిక్కర్ స్కామ్… తీహార్ జైలుకు సీఎం కేజ్రీవాల్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు రౌస్ అవెన్యూ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఏప్రిల్ 15 వరకు జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా కేజ్రీవాల్ జైలులో ఉండనున్నారు. కేజ్రీవాల్ను తీహార్ జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది.
Also Read: చేసిన పాపాలకు కేసీఆర్ పశ్చాత్తాపం పడాల్సిందే… T-కాంగ్రెస్ ట్వీట్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం కేజ్రీవాల్ను ఈడీ మార్చి 21న అరెస్ట్ చేసి రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చింది. న్యాయస్థానం కేజ్రీవాల్ను వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఇవాళ్టితో వారం రోజుల కస్టడీ ముగియడంతో ఈడీ అధికారులు కేజ్రీవాల్ను న్యాయస్థానంలో హాజరుపర్చారు. ఈ క్రమంలో కోర్టు కేజ్రీవాల్కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.
3 Comments