తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Suman: రాజకీయాలపై సినీ నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు

టాలీవుడ్ నటుడు సుమన్ తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ నాయకులను అవినీతి పరుల్ని చేసింది ప్రజలేనని అన్నారు. అన్ని పార్టీల నాయకుల వద్ద డబ్బులు తీసుకుని వారికి ఇష్టమైన వారికి ఓట్లు వేస్తున్నారన్నారు. ఓటర్లు డబ్బు తీసుకోకుండా ఓటు వేసినప్పుడే ప్రజాస్వామ్యానికి బలం చేకూరుతుందని అన్నారు.

ALSO READ: ఢిల్లీ లిక్కర్ స్కామ్… తీహార్ జైలుకు సీఎం కేజ్రీవాల్

ఇక, తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదన్న ఆయన..రాజకీయాల్లోకి రావడం వల్ల పెద్దగా ఉపయోగం కూడా ఏమీ లేదని చెప్పారు. రాజకీయాల కంటే తనకు సమాజానికి సేవ చేయడమే ముఖ్యమని చెప్పారు. తాను తెలంగాణలో ఉంటున్నాను కాబట్టి ఏపీ రాజకీయాలపై మాట్లాడటం సరికాదని అన్నారు. ఐదు సంవత్సరాలు బాగుండాలి అంటే.. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని, మనం వేసే ఒక్క ఓటు మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button