BRS Party: తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందనుకోలేదు: కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో రైతులంతా కన్నీరుమున్నీరవుతున్నారని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 200 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. మూడు జిల్లాలో ఎండిపోయిన పంటల్ని పరిశీలించానని… ప్రభుత్వం నీళ్లు ఇస్తామంటేనే పంటలు వేశామని రైతులు చెప్పారని తెలిపారు. కానీ ప్రభుత్వం నీళ్లు ఇవ్వకుండా మోసం చేసిందని రైతులు బాధపడుతున్నారని ఆరోపించారు.
Also Read: ఎన్నికల అభ్యర్థులకు ఈసీ ఝలక్.. ఇక నుంచి కొత్త రూల్స్
తెలంగాణలో మళ్లీ రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందని అనుకోలేదని ఎమోషనల్ అయ్యారు. గత ఐదేళ్లలో తెలంగాణలో నీళ్ల ట్యాంకర్లు కనిపించలేదని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 110 రోజుల్లోనే హైదరాబాద్లో వాటర్ ట్యాంకులు దర్శనమిస్తున్నాయని విమర్శించారు. ఉన్న నీటిని, విద్యుత్ను కూడా వాడుకునే తెలివి లేదని ఎద్దేవా చేశారు.
Also Read: కాంగ్రెస్ పార్టీ నేతలను కొనొచ్చు… కార్యకర్తలను కాదు: హరీష్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయాలు చేయడానికి తీరిక ఉందని కానీ రైతు బంధు వేయడానికి తీరిక లేదా అని ఫైర్ అయ్యారు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం సెట్ కావాలని కాస్త సమయమిచ్చామని.. నాలుగు నెలలైంది కాబట్టి ప్రశ్నిస్తున్నామన్నారు. రాజకీయాలకు సమయం ఉంది కానీ.. ప్రజల సమస్యలు పట్టించుకోరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న నీటి, విద్యుత్ సమస్యకు కారణమెవరని ప్రశ్నించారు. దేశంలోనే నెంబర్ 1గా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఇంత తక్కువ కాలంలోనే ఈ దుస్థితి రావడం ఏంటని ప్రశ్నించారు.
2 Comments