తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం: కవిత బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఇవాళ కీలక పరిణామం జరగనుంది. ఈ కేసులో అరెస్టై తీహార్ జైల్లో జ్యుడీషియల్ రిమాండును ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు (సీబీఐ ప్రత్యేక కోర్టు) ఈ కేసును విచారించనుంది. తన చిన్న కుమారుడు పరీక్షలు రాస్తున్నాడని, ఈ మేరకు తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్‌లో కవిత పేర్కొన్నారు.

ALSO READ:  తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందనుకోలేదు: కేసీఆర్

ఈ పిటిషన్‌పై రౌజ్ అవెన్యూ కోర్టు ఎలా స్పందిస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు ఈడీ అధికారులు మాత్రం కవితను బెయిల్ ఇవ్వొద్దని కోరుతున్నారు. లిక్కర్ స్కాం కేసులో కవిత ప్రధాన సూత్రధారిగా ఉన్నారని, దాదాపు రూ.100 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు ఈడీ ఆరోపిస్తోంది. మరోవైపు, ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను సైతం అరెస్ట్ చేసిన ఈడీ కేసుకు సంబంధించి కీలక విషయాలు తెలుసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button